రాలిపోతున్న బుట్టబొమ్మ జీవితానికి కొత్త చిగురు.. ఇకనైనా.?

బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఒక యంగ్ హీరోతో కలిసి నటించేందుకు సిద్ధమయ్యింది అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అది కూడా ఒక మెగా హీరోతో అవకాశమట. ప్రస్తుతం ఈ విషయం కాస్త నెట్టింట తెగ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఇది విన్న చాలామంది నెటిజెన్లు రాలిపోతున్న బుట్ట బొమ్మ జీవితానికి కొత్త చిగురు వచ్చేనా.. ఇకనైనా సక్సెస్ అవుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అనేది చాలా కష్టం.. ఎందుకంటే ఈ కలర్ ఫుల్ రంగుల ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు.. ఉదాహరణకు రాత్రికి రాత్రే స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు.. రాత్రికి రాత్రే సినీ జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఒక లైలా కోసం చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలకు జోడిగా కూడా నటించి వరుస హిట్లు అందుకుంది దర్శకులకు లక్కీ హీరోయిన్గా మారిపోయింది.

అయితే రోజులనేవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా..గత ఏడాది నుంచి ఇప్పటివరకు వరుసగా ఐదు డిజాస్టర్ లను అందుకుంది. మరొకవైపు మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కొన్ని కారణాలవల్ల తప్పుకోవాల్సి వచ్చింది దీంతో ఈమె కెరియర్ కాస్త సందిగ్ధంలో పడిపోయింది..ఈమె కెరియర్ పతనం అయిపోయింది అంటూ కామెంట్లు వినిపిస్తున్న సమయంలో సాయి తేజ్తో ఒక సినిమాలో అవకాశం వచ్చిందని సమాచారం. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది అని.. ఈ సినిమా షూటింగ్ కూడా ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో నైనా ఈమె జీవితానికి కొత్త చిగురు వస్తుందేమో చూడాలి.