`లైగర్` వంటి డిజాస్టర్ పడినా సరే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గేలేదు. అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ విజయ్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న చిత్రాల్లో `ఖుషి` ఒకటి.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతోంది. అయితే విడుదలకు రెండు నెలల ముందే ఈ సినిమా ఓటీటీ డీల్ కళ్లు చెదిరే రేటుకు క్లోజ్ అయిందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.30కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. దీంతో అన్ని భాషలకు చెందిన హక్కులను ఆమెజార్ ప్రైమ్ వారే సొంతం చేసుకున్నారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ లేకపోయినా.. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట టాపిక్ గా మారింది. విజయ్ కు సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. లైగర్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరే విజయ్ నటించిన ఖుషి ఓటీటీ హక్కులు రూ. 30 కోట్లకు అమ్ముడు పోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.