ఆదిపురుష్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే…

రూ.500 కోట్ల బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందిన సినిమా ఆది పురుష్‌. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సినిమాకి రిలీజ్ కు ముందే ఆదిపురుష్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదెలాగా అని ఆశ్చర్య పోతున్నారా.. సినిమా చూడకుండానే అది హిట్టా, పట్టా అని చెప్పగల సామర్థ్యం ఒకరికుంది. ఆయన మరెవరో కాదు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి. ఈ ఆస్ట్రాలజర్ ఇప్పటివరకు ఎన్నో విషయాలను ముందే అంచనా వేయగా అవన్నీ జరిగాయి. సమంత నాగచైతన్యల విడాకుల నుంచి మొన్న జరిగిన లావణ్య-వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం వరకు వేణు స్వామి జ్యోష్యాలు నిజమయ్యాయి.

కాగా తాజాగా ఈ జ్యోతిష్య నిపుణుడు ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఆది పురుష్ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్న ఆది పురుష్ సినిమా జస్ట్ యావరేజ్‌ మూవీగా నిలిచిపోతుందని ఈ ఆస్ట్రాలజర్ చెప్పాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నార్త్ లోని వైరల్ అవుతున్నాయి.

వేణు స్వామి ఈ మాటలను ప్రభాస్ జాతకం తిరగేసే చెప్పాడట. ప్రభాస్ జాతకరీత్యా ఆదిపురుష్ సినిమా సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేయలేదని, బాహుబలి రేంజ్ లో అది సక్సెస్ అయ్యే ఛాన్సే లేదని వేణు స్వామి వ్యాఖ్యానించాడు. సినిమాలో మంచి కంటెంట్ లేకపోవడం వల్ల అది పెద్ద హిట్ అందుకోలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. 3D వెర్షన్ వచ్చినా పిల్లల వల్ల అది హిట్ కాలేదని అన్నాడు. ఈ ఏడాదిలో ప్రభాస్ జాతకం అసలు బాగోలేదని కూడా వేణు స్వామి కొద్ది రోజుల క్రితం కామెంట్స్ చేశాడు. మొత్తం మీద వేణు స్వామి ఇచ్చిన ఈ ఫస్ట్ రివ్యూ నిజమవుతుందా లేక అతడి మాటలను అబద్ధమవుతాయా అనేది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.