సూపర్ హిట్ చిత్రాలను వదిలేసుకున్న స్టార్ హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పటికి ఎంట్రీ ఇస్తున్నారు..కొంతమంది సక్సెస్ అవ్వగా మరి కొంతమంది ఫెడౌట్ అవుతున్నారు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది హీరోయిన్స్ కొన్ని సినిమాల్లో అనుకున్న తర్వాత మారిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయట. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మొదట హీరోయిన్గా అనీషా హంసరోజ్ అనే అమ్మాయిని తీసుకోవాలని సెలెక్ట్ చేయగా ఆమె లుక్ లో సెట్ కాకపోవడంతో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారట.

బిజినెస్ మాన్ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా శృతిహాసన్ అనుకోగా కానీ కాజల్ అగర్వాల్ నటించడం జరిగింది.

ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో ముందుగా మెయిన్ హీరోయిన్ గా అనుష్క అనుకోగా కొన్ని కారణాల చేత తమన్నా అని తీసుకోవడం జరిగింది.

రంగస్థలం సినిమాలో మొదట హీరోయిన్గా అనుపమ పరమేశ్వరాని అనుకోగా.. చివరికి సమంత ను ఫైనల్ చేశారు.

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో మొదట అనుష్కను తీసుకోవాలనుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. కొన్ని కారణాల చేత చివరికి ప్రియమణిని ఫైనల్ చేశారు.

రాజు గారి గది-3 లో హీరోయిన్గా తమన్నాని తీసుకోవాలని డైరెక్టర్ ఓంకార్ అనుకోగా కానీ చిన్నారి పెళ్లికూతురు నటి చివరికి సెట్ అయ్యింది.

గీత గోవిందం సినిమాలో మొదట హీరోయిన్ గా రకుల్ ప్రీతిసింగ్ అనుకోగా డైరెక్టర్ పరుశురాం రష్మిక మందన సెలెక్ట్ చేయడం జరిగిందట.

ఇక మహానటి సినిమా కోసం మొదట నిత్యామీనన్ను సంప్రదించగా కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేయడంతో కీర్తి సురేష్ నటించిని

అలాగే రాక్షసుడు సినిమాలో రాశి ఖన్నా అనుకోగా అనుపమ సెలెక్ట్ అయింది. జెర్సీ హిందీ చిత్రంలో రష్మిక బదులు మ్రుణాల్ ఠాకూర్ నటించింది.. కోచడియన్ సినిమాను అనుష్క వదులుకోవడంతో దీపిక పదుకొనే ఫైనల్ అయింది