ఓజీ సినిమాపై హైప్ పెంచేస్తున్న చిత్ర బృందం.. తేడా వస్తే అంతేసంగతులేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే వారాహి యాత్రను కూడా ప్రారంభించి అభిమానులలో ఫుల్ జోష్ నింపారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు చిత్ర బృందం.

Pawan Kalyan's 'OG' to finish an important schedule today

రోజుకి ఇందులో నటిస్తున్న నటీనటులు చెపుతున్న మాటలతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రను పోషించడానికి ఓజి చిత్ర బృందం బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి మరొక న్యూస్ ఫిలింనగర్ లో వైరల్ గా మారుతోంది.పవన్ కళ్యాణ్ ఇందులో స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారని మొదటిసారి డ్యూయల్ రోల్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో ఒక పాత్ర పేరు గాంధీ మరొక పాత్ర పేరు ఓజాస్ గంభీర్ అలియాస్ అనే టాక్ వినిపిస్తోంది. మొదటిసారి పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్స్ కనిపించబోతున్నారని విషయం అభిమానులకు తెలియగానే చాలా సంబరపడిపోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడిగా హీరోయిన్ అరుల్ మోహన్ నటిస్తోంది. పవన్ కళ్యాణ్ వదిన పాత్రలో శ్రీయ రెడ్డి నటిస్తున్నట్లు సమాచారం. విలన్ గా ఇందులో ఇమ్రాన్ హస్మి నటిస్తున్నారు.