అక్కినేని హీరోల `మనం` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ రాశి ఖన్నా.. `ఊహలు గుసగుసలాడే` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.
అయితే గత కొంత కాలం నుంచి ఈ బ్యూటీ వరుస ఫ్లాపులతో సతమతం అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, సరైన హిట్ మాత్రం పడలేదు. కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో కార్తి హీరోగా తెరకెక్కిన `సర్దార్` మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అదే సమయంలో రుద్ర అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రాశి ఖన్నా నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ `ఫర్జి` సైతం నార్త్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం సౌత్ లో ఓ నాలుగు ప్రాజెక్ట్ లను టేకప్ చేసిన ఈ భామ బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా వైట్ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించి రెస్టారెంట్ లో డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో రాశి ఖన్నా యమా హాట్ గా కనిపించడంతో.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఆమె అందానికి టెంప్ట్ అయిపోయాడు. `నాకు ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ నెంబర్ ఇంకా దొరకలేదు` అంటూ కొంటెగా తేజ్ కామెంట్ పెట్టడం ప్రధాన్యత సంతరించుకుంది.