తిరుమలలో కృతి సనన్‌, ఓం రౌత్ పిచ్చి ప్రవర్తన.. ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు!!

జూన్ 6న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరుపుకుంది. ఆపై చిత్ర యూనిట్ జూన్ 7 అంటే ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సినిమా డైరెక్టర్ ఓం రౌత్, సీత పాత్రలో నటించిన కృతి సనన్‌తో పాటు తదితరులు ఏడుకొండల వెంకన్న స్వామి అర్చన సేవలో భాగమయ్యారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాక దర్శకుడు ఓం రౌత్ చేసిన ఓ పని పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది.

కృతి సనన్ దర్శనం తరువాత వెళ్ళిపోవాలని తన కారు దగ్గరకి వెళ్తుండగా ఓం రౌత్ ఆమె దగ్గరకు వెళ్లి కౌగిలించుకొని చెంపపై ముద్దు పెట్టాడు. అంతేకాకుండా గాడ్ బ్లెస్స్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చాడు. ఇది చూసిన స్వామివారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వసాధారణమే అయినా తిరుమల లాంటి దేవస్థానానికి వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించడం ఏంటని చాలామంది ఫైర్ అవుతున్నారు.

ఇకపోతే రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ రూపొందించాడు. అయితే అతను ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అతను అది ఏం తిరుమల కొండ అనే విషయాన్ని మరిచి ఈ తప్పు చేశాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి అతన్ని బుద్ధి వచ్చేలాగా తిట్టిపోస్తున్నారు. తిరుమలలో జరిగిన సంఘటనపై త్వరగా స్పందించాలి అంటూ భక్తులు కోరుతున్నారు. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రీరాముడిగా ‘ప్రభాస్ ‘, సీతగా ‘కృతి సనన్ ‘ హనుమంతునిగా ‘దేవదత్త నాగె’, రావణుని పాత్రలో ‘సైఫ్ అలీ ఖాన్ ‘ లక్ష్మణుడిగా ‘సన్నీ సింగ్’ నటించారు.