మేనేజర్ తో గొడవలపై.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను అందుకుంది. తెలుగు ,తమిళ, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత నాలుగు రోజులుగా రష్మిక వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా ఆమె కెరియర్ ప్రారంభం నుంచి ఆమె వెనక చాలా నమ్మకంగా పనిచేసిన మేనేజర్ రష్మిక వద్ద నుంచి వెళ్లిపోవడంతో ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.ఆమె వద్ద నుంచి రూ.80 లక్షల రూపాయలు మోసం చేయడంతో రష్మిక అతడిని తొలగించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై రష్మిక ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అన్నట్టుగా అభిమానులు భావించారు. కానీ తాజాగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది రష్మిక.. ఆమె మేనేజర్ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడిపోయామని అందుకు ఎలాంటి గొడవలు జరగలేదని తెలియజేసింది. ఆరోగ్యకర వాతావరణంలో ఇద్దరము కలిసి పని చేసాము పరస్పర ఒప్పందంతోనే విడిగా కెరియర్ను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళు కాబట్టి అలాగే వర్క్ చేశామని కానీ ఇప్పుడు హుందాగా విడిపోవడం జరిగింది అంటూ తెలిపింది రష్మిక.

దీంతో రష్మిక, మేనేజర్ ఆమెను మోసం చేశాడన్న వార్తలు ఫేక్ అని ఈ నోటు ద్వారా తెలియజేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో యానిమల్ చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వం వహించారు హీరోగా రణబీర్ కపూర్ నటించారు. టాలీవుడ్ విషయానికి వస్తే పుష్ప-2 సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉంది రష్మిక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతోంది. ఇవే కాకుండా పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది.