`విక్రమార్కుడు` సీక్వెల్ కు ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌.. డైరెక్ట‌ర్ మాత్రం రాజ‌మౌళి కాదండోయ్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస ప్రాజెక్ట్ ల‌ను టేక‌ప్ చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేతిలో పుష్ప 2, యానిమ‌ల్, రెయిన్ బో వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. తాజాగా విక్ర‌మార్కుడు సీక్వెల్ కు కూడా ఈ బ్యూటీ సైన్ చేసింది.

విక్ర‌మార్కుడు సీక్వెల్ అంటే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అనుకుంటారేమో.. కాదండోయ్. అస‌లు విక్ర‌మార్కుడు సీక్వెల్ తెర‌కెక్కేది తెలుగులోనే కాదు. ర‌వితేజ హీరోగా రాజ‌మౌళి రూపొందించిన విక్ర‌మార్కుడు సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. బాలీవుడ్ లో `రౌడీ రాథోడ్` రీమేక్ చేశారు. అక్షయ్‌కుమార్‌ హీరోగా న‌టించ‌గా.. అక్క‌డ కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అయితే ఇప్పుడు బాలీవుడ్ కు `రౌడీ రాథోడ్` సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో షాహిద్‌ కపూర్ హీరోగా ఈ సీక్వెల్ ప‌ట్టాలెక్క‌బోతోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ ఈ మూవీకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం తాజాగా మేక‌ర్స్ ర‌ష్మిక‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట‌. మొత్తానికి బాలీవుడ్ లో ఇంత వ‌ర‌కు స‌రైన్ హిట్ కొట్ట‌క‌పోయినా.. ర‌ష్మిక మ‌రో ప్రాజెక్ట్ కు సైన్ చేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.