స్వయంభు చిత్రం కోసం హీరో నిఖిల్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గత ఏడాది కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇప్పటికే స్పై అనే ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగివున్న మిస్టరీని ఛేదించే యువకుడి పాత్ర నిఖిల్ కనిపించబోతున్నట్లు సమాచారం. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉందని ప్రేక్షకులకు కచ్చితంగా రీచ్ అయ్యేలా ఉందని చెప్పవచ్చు.

గత కొద్దిరోజుల క్రితం వీర్ సవర్కర్ లైఫ్ లో ఒక భాగమైన ది ఇండియా హౌస్ స్టోరీ తో మరొక సినిమాని కన్ఫామ్ చేశారు ఈ చిత్రాన్ని రాంచరణ్, అభిషేక్ అగర్వాల్ పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 19వ దశాబ్దంలో లండన్ లో జరిగిన ఒక కథని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఇండియన్ హిస్టరీలో ఒక వారియర్ కింగ్ గా స్వయంభు అనే టైటిల్ మూవీ ని అనాజ్ చేయడం జరిగింది.

ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమాని భరత కృష్ణమాచారి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. కార్తికేయ-2 చిత్రానికి రూ .8 కోట్లు అందుకున్న నిఖిల్..ప్రస్తుతం చేయబోయే స్వయంబు చిత్రానికి రెమ్యూనరేషన్ కాకుండా లాభాలలో వాటా తీసుకోవడానికి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో కొన్ని కోట్ల రూపాయలు అందుకోబోతున్నారని సమాచారం.. ముఖ్యంగా ఈ సినిమా కంప్లీట్ గా వార్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త ప్రపంచంలోకి తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.