టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ హీరోయిన్ , కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో రమాప్రభ కూడ ఒకరు. అప్పుడే కాకుండా ఇప్పుడు హీరోల చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉంటోంది.ఈమె వయస్సు 76 సంవత్సరాలు ఈ మధ్యనే యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది రమా ప్రభ.
రమా ప్రభ మాట్లాడుతూ..మూడు నెలలు చిన్న టూర్ వేశానని హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ,శిరిడి ఇలా కొన్ని ప్లేసులకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే నాపై కొన్ని సంఘటనలు జరిగాయని ఒక్కసారి జాలేస్తోంది .ఒక్కసారి కోపం వస్తోంది.. ఒక్కసారి నవ్వు వొస్తోందనీ ఈ మాటలు వింటే అంటూ తెలుపుతోంది..ఈమధ్య నాపై ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య నేను కొన్ని విషయాలపై పాపులారిటీ అవుతున్నానని చెప్పుకొచ్చింది రమాప్రభ
ఈమెకు చెన్నైలో ఒక ఇల్లు ఉందని అందులో చాలామంది ఉన్నారని కానీ ఆ ఇల్లు నాది కాదని మరొకరిదని చెబుతున్నారని రమప్రభ కామెంట్స్ చేశారు ఈ కామెంట్లు వింటే నాకు నవ్వొచ్చిందని తెలుపుతోంది.. ఇంకొక విషయం ఏంటంటే నాకు రజినీకాంత్ డబ్బులు ఇచ్చారని ప్రచారం జరుగుతోందని ఆమె తెలిపింది.. కానీ ఆయన నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఇది నిజం కాదు అంటూ రమప్రభ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
నేను 13 ఏళ్ల నుంచి బాగా సంపాదించుకున్నాను నాకు ఎవరు ఇవ్వలేదు అని ఆమె మాటల్లో తెలిపింది. ఎవరు నోటికి వచ్చినల్లా వాళ్లు మాట్లాడితే నాకు నచ్చదు.. ఈ వీడియో చూసిన నేటిజెన్లు శరత్ బాబు గురించి ఫీలవుతున్నారా అమ్మ అని అడగగా..13 ఏళ్లు కలిసే ఉన్నాము ఆ బాధ తప్పకుండా ఉంటుంది అంటూ తెలియజేస్తోంది. ఈమె అప్పట్లో ఎంతో కష్టపడి శరత్ బాబును హీరోగా చేయాలని చాలా ప్రయత్నాలు చేసి చాలా నష్టపోయానని తెలియజేసింది.. ఆయనని హీరో గా చేయడం కోసం ఎంత నష్టపోయానో నాకు మాత్రమే తెలుసు అంటోంది. ప్రస్తుతం రమా ప్రభ మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.