మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. ఈ గుడ్న్యూస్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ లోనే కాకుండా మెగా అభిమానుల్లో సైతం ఎంతో సంతోషాన్ని నింపింది. అలాగే ఉపాసన గర్భం దాల్చిన దగ్గరనుంచి ఆమె కాలు కందకుండా చూసుకుంటున్నారు.
రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యతోనే గడుపుతూ ఆమెను సంతోష పెడుతున్నాడు. ఇప్పటికే పలు చోట్ల ఉపాసనకు బేబీ షవర్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఇక ఉపాసన డెలివరీ డేట్ లాక్ అయ్యింది. వచ్చే నెలలోనే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే భార్య ప్రసవం కోసం రామ్ చరణ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాడట. డెలివరీ ని అమెరికాలో చేయిద్దామని రామ్ చరణ్ మొదట అనుకున్నా.. అందుకు ఉపాసన అంగీకరించలేదట. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లోనే డెలివరీ చేయించుకుంటానని చెప్పిందట.
దీంతో ప్రపంచం లోనే అత్యుత్తమ గైనకాలజిస్ట్స్ ని ఉపాసన డెలివరీకి రామ్ చరణ్ రప్పిస్తున్నారట. అలాగే పుట్టబోయే బిడ్డ హెల్త్ చెకప్ కోసం పీడీయాట్రిషన్స్ ని కూడా తీసుకొస్తున్నారట. అంతేకాదు, ఉపసాన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ లో ఓ ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేస్తున్నారట. ఆ ఫ్లోర్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ మినహా మరెవ్వరికీ అనుమతి ఉండదట. ఏదేమైనా రామ్ చరణ్ భార్య డెలివరీ కోసం భారీ ఏర్పాట్లే చేస్తున్నాడని అంటున్నారు. కాగా, రామ్ చరణ్ ఉపాసన డెలివరీ తర్వాత మూడు నెలల షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడు. ఆ మూడు నెలలు పుట్టబోయే బిడ్డతోనే టైమ్ స్పెండ్ చేయాలని చరణ్ భావిస్తున్నాడట.