వారు పెట్టిన టార్చర్ వల్లే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్న.. కృతి సనన్..!!

టాలీవుడ్ లో మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి సనన్.. ఈ సినిమా వర్కౌట్ కాకపోవడం వల్ల నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఏ సినిమాలో కూడా నటించకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వతహాగా మోడల్గా పేరు సంపాదించడంతో బాలీవుడ్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నది.

Kriti Sanon styles chocolate brown saree with comfy and sparkling juttis.  They cost Rs… - India Today
ఈ అమ్మడు చేసిన సినిమాలు మొదట్లో పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఐరన్ లెగ్గానే ట్యాగ్ని వేశారట ..కానీ అప్పుడు ఈ అమ్మడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ని బాగానే ముందుకు తీసుకువెళ్ళింది.ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది కృతి సనన్. ఎలాంటి సినిమా నే పద్యం లేని ఈ ముద్దుగుమ్మ ఈ రేంజ్కి రావడానికి చాలా కష్టపడిందని తెలియజేస్తోంది. తన సినీ కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాళ్లంతా టార్చర్ చేయడం వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్దామనుకున్నానని కృతి సనన్ తెలియజేస్తోంది.

తన తల్లి చెప్పిన మాటలే తనని ఆపి ఇప్పుడు ఈ స్థాయికి చేరేలా చేశాయని తెలుపుతూ తన ధైర్యం స్ఫూర్తి అన్ని కూడా తన తల్లి అంటూ తెలియజేస్తోంది. కృతి సనన్ తండ్రి సిఏ ఆమె తల్లి యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అన్నట్టుగా తెలియజేసింది.. హీరోయిన్గా చేస్తే పెళ్లి చేసుకోరు జీవితాంతం ఒంటరిగానే ఉండాల్సి ఉంటుంది అంటూ కొంతమంది బంధువులు తెలియజేశారట.కానీ ఆ సమయంలో తన తల్లి ధైర్యం చెప్పి చదువుకుంటూ మోడలింగ్ చేసేలా చేసిందని అలా మొదట యాడ్స్లో నటించే అవకాశం వచ్చింది.. బీటెక్ తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాను అక్కడ తెలిసిన వారు ఎవరు లేక ఒంటరిగా ఫీల్ అయి రెండు వేల పాటు అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉండేదాన్ని తెలిపింది. అలా హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో నటించింది.