వారంద‌రికీ రూ.10 వేలు గిఫ్ట్ గా ఇచ్చిన ప్ర‌భాస్‌.. నిజంగా డార్లింగ్ గొప్పోడురా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. తాజాగా ఈ విష‌యం మ‌రోసారి రుజువు అయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ `స‌లార్‌` యూనిట్ స‌భ్యులంద‌రికీ రూ. 10 వేలు చొప్పున గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్ష‌న్ మూవీ ఇది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఇట‌లీలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్న యూనిట్ స‌భ్యులంద‌రికీ ప్ర‌భాస్ రూ. 10 వేలు చొప్పున ట్రాన్స్‌ఫ‌ర్ చేసి.. వారంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడ‌ట‌.

స‌లార్‌ సినిమా కోసం యూనిట్‌ సభ్యులంతా రేయింబవళ్లు శ్రమింస్తున్నార‌ని.. అందుకు ప్రతిఫలంగానే తన వంతుగా ప్రభాస్ వారికి రూ. 10 వేలు గిఫ్ట్ గా ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక స‌లార్ యూనిట్ స‌భ్యులంద‌రూ డార్లింగ్ గొప్ప మ‌న‌సుకు ఫిదా అవుతూ.. ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్ర‌భాస్ న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్` అట్ట‌హాసంగా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయి.