ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇటీవల కాలంలో సెలబ్రెటీలపై వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ హెడ్లైన్స్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాను పాపులర్ అవ్వడం కోసం సినీ తారలపై బురద జల్లుతున్నారు. తాజాగా ఉమైర్ సంధు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను టార్గెట్ చేస్తూ ఓ సంచలన ట్వీట్ చేశాడు.
పూజా హెగ్డే గత ఏడాది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో పడ్డాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉమైర్ సంధు ట్వీట్ వదిలాడు. బ్యాక్ టు బ్యాక్ 5 డిజాస్టర్స్ పడటంతో పూజాహెగ్డేకి పిచ్చి పట్టిందని.. దాంతో గంటల తరబడి గదిలో ఒంటరిగా ఉంటోందని.. ఆమె యాంటి యాంగ్జయిటీ మరియు డిప్రెషన్ మందులు తీసుకుంటోందని ఉమైర్ సంధు పేర్కొన్నాడు.
అలాగే ప్రశాంతంగా ఉండేందుకు డ్రగ్స్ కూడా తీసుకుంటోందని ఆరోపించాడు. అక్కడితో ఆగలేదు గుంటూరు కారం షూటింగ్ సమయంలో పడక సుఖం కోసం మహేష్ బాబును లైంగికంగా వేధించిందని మరియు అతడిని లొంగదీసుకోనేందుకు పూజా హెగ్డే తెగ రెచ్చగొట్టిందని ఉమైర్ సంధు ఆరోపణలు చేశాడు. దీంతో అతగాడి ట్వీట్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పూజా హెగ్డే ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ పోస్ట్లు పెట్టడానికి సిగ్గులేదా అంటూ ఉమైర్ సంధును ఏకేస్తున్నారు. మొత్తానికి పూజా హెగ్డేపై చేసిన ట్వీట్ తో ఉమైర్ మరోసారి వార్తలకు ఎక్కాడు.