టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకి యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద తలనొప్పిగా మారిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మ్యానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు 10 ప్రాజెక్ట్ లను ఈ అమ్మడు లైన్ లో పెట్టింది. ఇక శ్రీలీల దెబ్బకు పూజా హెగ్డే గిలగిలా కొట్టేసుకుంటుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
ఒకటి కాదు రెండు కాదు పూజా హెగ్డే చేయాల్సిన నాలుగు సినిమాలను శ్రీలీల లాగేసుకుందట. ఈ జాబితాలో `గుంటూరు కారం` ఒకటి. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో మొదట పూజా హెగ్డేనే హీరోయిన్ అన్నారు. కానీ ఆ తర్వాత శ్రీలీలను కూడా తీసుకున్నారు. పైగా శ్రీలీల పాత్రకే అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలియడంతో.. పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ అయిందట.
అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న `ఉస్తాద్ భగత్ సింగ్` లో మొదట పూజా హెగ్డేనే హీరోయిన్ అన్నారు. రెండేళ్ల క్రితమే దర్శకుడు హరీష్ ఓ ఈవెంట్లో ఈ విషయన్ని ప్రకటించారు. కానీ ఇటీవల సినిమా ప్రారంభమయ్యే నాటికి శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీలోనూ పూజా హెగ్డేను ముందుగా హీరోయిన్ అనుకున్నా.. చివరకు శ్రీలీలను ఎంపిక చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇందులో హీరోయిన్ కోసం పూజా హెగ్డే, శ్రీలీల పేర్లని పరిశీలిస్తున్నారట. అయితే శ్రీలీలనే హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి శ్రీలీల కారణంగా పూజా హెగ్డేకు వచ్చిన అవకాశాలు, రావాల్సిన అవకాశాలు రెండు పోతున్నాయి.