షాకింగ్ ట్విస్ట్‌.. `గుంటూరు కారం` నుంచి త‌ప్పుకున్న పూజా హెగ్డే.. కార‌ణం ఏంటంటే?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌ లో `గుంటూరు కారం` ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్ర‌నికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

హైదరాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. రీసెంట్ గా బ‌ట‌య‌కు వ‌చ్చిన ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అలాగే సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే.. ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందంటూ ప్రచారం జరుగుతోంది.

నిజానికి మొదటి నుంచి గుంటూరు కారం మూవీ స్క్రిప్ట్, రిలీజ్ డేట్, ఇతర నటీనటుల విషయంలో మార్పులు జరుగుతూనే వచ్చాయి. ముందు పూజా హెగ్డేనే హీరోయిన్ అన్నారు. ఆ త‌ర్వాత స్క్రిప్ట్ మార‌డంతో.. శ్రీ‌లీల యాడ్ అయింది. పైగా శ్రీ‌లీల పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంద‌ని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు పూజా హెగ్డే మ‌హేష్ బాబుకు హ్యాండిచ్చింద‌ట‌. ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాల్లో ఇబ్బంది కల‌గ‌డం వ‌ల్లే పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి త‌ప్పుకుంద‌ట‌. దీంతో మేక‌ర్స్ పూజా స్థానంలో మ‌రొక హీరోయిన్ ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డార‌ని ఇన్‌సైడ్ టాక్ నుడ‌స్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.