ర‌వితేజ‌కు కూడా రూ. 100 కోట్లు ఇస్తున్నారా.. మాస్ రాజా మామూలోడు కాద‌య్యో!?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అనంత‌రం ర‌వితేజ నుంచి రావ‌ణాసుర మూవీ వ‌చ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ర‌వితేజ `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్నాడు.

వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ లో ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ర‌వితేజ‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం సౌత్ లో రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోలు చాలా త‌క్కువ మందే ఉన్నారు.

అయితే ఇప్పుడు ర‌వితేజ‌కు కూడా ఓ నిర్మాణ సంస్థ రూ. 100 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు రెడీ అయింద‌ట‌. ర‌వితేజ పాన్ ఇండియా హీరో కాదు. అయినా స‌రే ఆయ‌న‌కు ఆ రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారంటూ మాస్ రాజా మామూలోడు కాద‌య్యో అన‌డం స‌హ‌జ‌మే. కానీ, ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. పీపుల్స్ మీడియా సంస్థ రవితేజకు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. కానీ, ఇది ఒక సినిమా కోసం కాదు. రవితేజతో నాలుగు సినిమాలు చేయ‌బోతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే రూ. 100 కోట్ల‌కు డీల్ కుదుర్చుకున్నార‌ని తెలుస్తోంది.