మాస్ మహారాజా రవితేజ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం రవితేజ నుంచి రావణాసుర మూవీ వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్నాడు.
వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. రవితేజకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సౌత్ లో రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు.
అయితే ఇప్పుడు రవితేజకు కూడా ఓ నిర్మాణ సంస్థ రూ. 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయిందట. రవితేజ పాన్ ఇండియా హీరో కాదు. అయినా సరే ఆయనకు ఆ రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారంటూ మాస్ రాజా మామూలోడు కాదయ్యో అనడం సహజమే. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పీపుల్స్ మీడియా సంస్థ రవితేజకు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. కానీ, ఇది ఒక సినిమా కోసం కాదు. రవితేజతో నాలుగు సినిమాలు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలోనే రూ. 100 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.