మూడో భార్య కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను వ‌దిలేసిందా.. ఇప్పుడిదే హాట్ టాపిక్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మూడో భార్య అన్నా లెజ్నెవా కూడా వ‌దిలేసిందంటూ గ‌త వారం రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నా లెజ్నెవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడాకుల‌కు సిద్ధం అయ్యాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. రీసెంట్ గా మెగ ఫ్యామిలీతో ఓ ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం జ‌రిగింది. అదే వ‌రుణ్ తేజ్ ఎంగేజ్మెంట్‌.

ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. ఇప్పుడు మూడు బంధంతో ఒక‌టి కావాల‌ని రెడీ అయ్యారు. ఇరు కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో జూన్ 9వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ జ‌రిగింది. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్టైలిష్ అవ‌తార్ లో మెరిశారు.

కానీ, ఆయ‌న స‌తీమ‌ణి అన్నా లెజ్నెవా మాత్రం హాజ‌రు కాలేదు. మెగా ఫ్యామిలీతో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా అన్నా లెజ్నెవా పాల్గొంటుంది. అలాంటిది ఆమె వ‌రుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కు రాలేదు. పైగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా జంట‌గా క‌నిపించి చాలా కాల‌మే అయిపోయింది. వారాహి యాత్ర అంటూ ప‌వ‌న్ ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక అన్నా ఎక్క‌డ ఉందో కూడా తెలియ‌దు. దీంతో ప‌వ‌న్‌, అన్నా మ‌ధ్య మ‌న్స‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని.. వీరిద్ద‌రూ విడాకుల‌కు రెడీ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నా ఇప్పుడు త‌న సొంత దేశం అయిన ర‌ష్యాలో ఉంద‌ని అంటున్నారు.