టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సి.. తన మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ,వీర , కాంచన తదితర చిత్రాలలో నటించింది. అయితే ఇందులో కేవలం ఏమి సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడంతో ఈమెకు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసిన తాప్సి బాలీవుడ్లో మాత్రం క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించి స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యింది.
పలు రకాల లేడి ఓరియంటెడ్ చిత్రాలలో మెప్పించిన తాప్సి మరొక హీరోయిన్ కంగానా రనౌత్ తో కలసి మాటలు యుద్ధం కూడా చేస్తూ ఉంటుంది. అలా బాలీవుడ్లో తాప్సి కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సౌత్ లో అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో నటిస్తూ ఉంటుంది తాప్సి. తాజాగా తాప్సి బాలీవుడ్ పైన సెన్సేషనల్ కామెంట్లు చేయడం జరిగింది.
తాప్సి మాట్లాడుతూ బాలీవుడ్ పైన పలు ఆరోపణలు చేసింది. ఒక సినిమాలో ఏ ఏ పాత్రలకు ఎవరిని తీసుకోవాలని విషయంపై కొంతమంది నటీనటులు డిసైడ్ చేస్తారని తెలిపింది. టాలెంట్ ఉన్నవాళ్లు క్యారెక్టర్ కు సూట్ అయ్యేవాళ్ళను కాకుండా తమ స్నేహితులను ఏజెన్సీ వాళ్లను సిఫార్సు చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది హిందీలో క్యాంపులు , ఫేవరెటిజం అనేవి చాలానే ఉన్నాయని తెలియజేసింది. బాలీవుడ్ లో పక్షపాత ద్వారానే చాలానే ఉందని తెలియజేసింది తాప్సి. ఇలాంటి విషయంపై గతంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తెలియజేసింది.