త్రివిక్రమ్-పూజా హెగ్డేను ఆటాడేసుకుంటున్న నేటిజన్స్..!!

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా టీజర్ నిన్నటి రోజున విడుదలై ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్కులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇక మరొకవైపు కొంతమంది ఈ సినిమా ప్రచారంలోని విషయాన్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. బ్రో టీజర్లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే ఈమె ఎక్కడ కనిపించింది ఆమె ఆలోచిస్తున్నారా బ్రో టీజర్ ప్లే చేయగానే ముందుగా ఒక షాపింగ్ మాల్ యాడ్ పోస్టర్ కనిపిస్తుంది. అందులో పూజ హెగ్డే కనిపించడం జరుగుతుంది. ఈ యాడ్ కూడా సినిమాలో భాగంగా కనిపించింది.. దీంతో మేకర్స్ ఈ వీడియోని అలాగే కట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు ఈ పోస్టర్ నిటిజన్లను అభిమానులను అయ్యేలా చేస్తుంది.. బ్రో సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే పూజా హెగ్డేను టీజర్లో యాడ్ చేశారని అందుకే ప్రచార చిత్రాన్ని కాస్త ఆలస్యంగా రిలీజ్ చేశారంటూ కొంతమంది నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి తన సినిమాలకు తన పేరును స్టాంపుగా బ్రాండ్ వేసుకుంటారో.. త్రివిక్రమ్ కూడా పూజా హెగ్డేను అలా వేసుకున్నట్టు ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ ఈ టీజర్ లో ఆమెను పెట్టడానికేనా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తప్పించావు అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కొంతమంది నేటిజన్స్ పూజ లేకుండా సినిమాని త్రివిక్రమ్ చేయలేడు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. బ్రో సినిమాని తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వినోదయ సీతం సినిమాని రిమెక్కుగా చేస్తున్నారు. స్వయంగా సముద్ర ఖనినే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.