మెగా ప్రిన్సెస్ కోసం అంబానీ అదిరిపోయే గిఫ్ట్ పంపారట?

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఈ రోజు ఆ పాపకు చాలా గ్రాండ్ గా బారసాల కార్యక్రమం ఆహుతులమధ్య జరపబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి అలాగే వ్యాపార రంగాలకు సంబంధించిన అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కాంపౌండ్ లో సంబరాలు మిన్నంటుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు హాస్పిటల్ నుంచి బయటకు వస్తుండగా అభిమానులు పూల వర్షం కురిపించి తమ ఆనందాన్ని వెల్లడించిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలోనే… మెగా ప్రిన్సెస్ కి ఏ పేరు పెడుతున్నారు? పాప ఎవరి పోలిక? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానులు తమ మదిలోనే వేసుకున్న పరిస్థితి. ఎట్టకేలకు ఆ ప్రశ్నలకు ఈరోజు సమాధానం వెలువడనుంది. ఇకపోతే, పాపకి ఆల్రెడీ ఒక పేరు అనుకుంటున్నట్లు మొన్న ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పేరునే పాప బారసాల రోజు అందరికీ తెలియజేస్తాను అని కూడా రామ్ చరణ్ అప్పుడు చెప్పుకొచ్చారు. ఇక ఆ తరుణం రానే వచ్చింది. మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక ఈరోజు చాలా ఘనంగా జరగబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎక్కడ జరగబోతోంది? ఎవరెవరు రాబోతున్నారు? అన్నది సస్పెన్స్ గానే పెట్టారు.

ఇక అసలు విషయంలోకి వెళితే ఈ బారసాల వేడుకకు ఇండియన్ కుబేరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ దంపతులు రాబోతున్నారట. అంతేకాదు పాప కోసం ఒక బంగారు ఊయలను కూడా వారు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబందించినటువంటి విషయం నెట్టింట చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక మన మెగాస్టార్ తన మనవరాలు మంచి గడియల్లో పుట్టింది, మంచి జాతకం అని పొంగిపోయిన సంగతి అందరికీ తెలిసినదే. అంతే కాకుండా పాప జాతకం వల్లే తమ ఇంటికి సంతోషకరమైన వాతావరణం నెలకొంది అని ఆయన వెల్లడిస్తూ ఉండడం గమనార్హం.