ఇరువురి భామల నడుమన బాలయ్య.. సక్సెస్ కొడతారా?

గత ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మరింతగా బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా ఆయనకు చెల్లెలి పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇక ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది అని రీసెంట్గా వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాబీ బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేశారని సమాచారం. అందుకే ఈ సినిమా పనుల్లో బాబీ చాలా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే బాలయ్యకు హీరోయిన్స్ ను ఫిక్స్ చేశారట డైరెక్టర్ బాబీ. ఇప్పటికే బాలకృష్ణతో సింహ, జై సింహ, శ్రీరామరాజ్యం అంటూ మూడు సినిమాలలో నటించిన నయనతార.. ఇప్పుడు మళ్లీ బాలయ్యతో జత కట్టనుంది అని సమాచారం. అలాగే మరొక హీరోయిన్ గా రకుల్ ను తీసుకుంటున్నారట.

ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి బాలయ్యతో ఆమె నటించనుందని సమాచారం.. ఇకపోతే ఇరువురి భామల నడుమ నటించబోతున్న బాలయ్య.. ఎటువంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.