మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి బజాలు మోగబోతున్నాయి. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రియ సఖి లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని.. పెళ్లికి కూడా రెడీ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలే నిజం కాబోతున్నాయి. జూన్ 9వ తేదీ అనగా రేను వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ జరగబోతోందని గత వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లవ్ ను మెగా ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసింది. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9న నిర్వహించబోతున్నట్టు తెలిపింది. వరుణ్-లావణ్య కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ఓ అధికారిక పోస్ట్ పెట్టారు. అది కాస్త క్షణాల్లో వైరల్ అయింది. దీంతో త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్ లో కుటుంబ సభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుందని.. ఇక పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్ లో ఉంటుందని తెలుస్తోంది. కాగా, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్స్ సమయంలో ఏర్పడ్డ పరిచయమే ప్రేమగా మారింది. ఇరు కుటుంబసభ్యులు వీరి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి సిద్ధం అయ్యారు.