సినిమాలకు బ్రేక్ చెప్పనున్న మహేష్ బాబు.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి గత కొద్ది రోజులుగా అప్డేట్లు విడుదల అవుతూనే ఉన్నాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని రీవిల్ చేస్తూ ఒక స్ట్రైక్ వీడియోని విడుదల చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

Mahesh Babu Talks About Film With Baahubali Fame SS Rajamouli: "Always  Wanted To Do The Right Film At The Right Time If In Hindi"
మహేష్ బాబు ఈ చిత్రంలో మాస్ హీరోగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నారు.. ముఖ్యంగా రాజమౌళితే ఏ హీరోనైనా సినిమా తీస్తున్నప్పుడు మరో సినిమాలో నటించడానికి ఎక్కువగా ఇష్టపడరు.. ఎందుకంటే తన సినిమాలో నటించే హీరో లుక్ నుంచి డేట్స్ వరకు ఏది కూడా లీక్కు కావడం రాజమౌళికి పెద్దగా ఇష్టం ఉండదు. ఆ కారణం చేతనే మహేష్ ,త్రివిక్రమ్ కాంబోలో సినిమా మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

ఇక అప్పటినుంచి రాజమౌళి తర్వాత తీయబోయే రెండు సినిమాలలో ఒకటి మహేష్ తో తీయబోతున్నారు.. గుంటూరు కారం సినిమా విడుదలైన తర్వాత మహేష్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా ప్రారంభమయ్యిందంటే.. ఆ సినిమా పూర్తి అయ్యేసరికి దాదాపుగా రెండేళ్లు పైనే అవుతుంది.. కాబట్టి అప్పటివరకు మహేష్ బాబు ఇతర సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.