టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
మే 31 మహేష్ బాబు తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా టైటిట్ ను రివిల్ చేసిన మేకర్ ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి తరుణంలో ఓ ఇంట్రెస్ట్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేమిటంటే గుంటూరు కారం సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదట. టాలీవుడ్ కు చెందిన ఓ టాప్ హీరోకు ఈ సినిమా కథ వినిపించగా.. ఆయన రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఈ సినిమానే అట. మహేష్ కంటే ముందే కథ మొత్తం ఎన్టీఆర్ విన్నాడట. అయితే కథ నచ్చినప్పటికీ.. ఫుల్ స్క్రిప్ట్ ఆయనను సాటిస్ ఫై చేయలేకపోయిందట. అందుకే సున్నితంగా త్రివిక్రమ్ కు నో చెప్పి కొరటాల శివకు ఓటేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్టీఆర్ `దేవర` అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ ఎన్టీఆర్ నో చెప్పిన కథతో మహేష్ ను మెప్పించి.. `గుంటూరు కారం`ను పట్టాలెక్కించాడట.