బోల్డ్ పిక్స్ షేర్ చేసిన మౌని రాయ్‌.. బికినీలో మంటలు రేపుతోంది.

బాలీవుడ్ నటి మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె అందం చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. స్టార్ హీరోయిన్లు కూడా ఆమె గ్లామర్‌ను చూసి జలస్ గా ఫీల్ అవుతారు. మౌని రాయ్ స్టార్ హీరోయిన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయింది. ఈమె ఎక్కువగా విలన్ పాత్రలో నటిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ లో నటించింది మౌని రాయ్. నాగిని అనే సీరియల్ లో ఇష్టరూప నాగినిగా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సీరియల్ లో ఆమె నెగిటివ్ రోల్ చూసి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.

ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘బ్రహ్మస్త్ర’ సినిమా లో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా తరువాత మౌని రాయ్ కి మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్రహ్మస్త్ర సినిమాలో విలన్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. అలానే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఒక సంస్థ కోసం ఈ అమ్మడు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మౌని రాయ్ తొలిసారిగా ప్రముఖ కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై నడిచిన ఈ అమ్మడు అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పటినుండి వరుస ఈవెంట్స్ లో పాల్గొంటూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు తన భర్తతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది. ఆ తరువాత అబుదాబీలో నిర్వహించిన IIFA 2023 ఈవెంట్ లో పాల్గొంది. వాటికీ సంబందించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ బాలీవుడ్ సుందరి బికినీ లో దర్శనం ఇచ్చి అందరికి మతి పోగొడుతుంది. లైఫ్ స్టైల్ ఎషియా అనే ఫ్యాషన్ బ్రాండ్ కోసం ఇలా బోల్డ్ ఫోటోషూట్ చేయించుకుంది. రకరకాల బికినీ అవుట్‌ఫిట్స్‌తో హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి సమ్మర్ లో ఇంకాస్త కాక పుట్టిస్తుంది. మౌని రాయ్ షేర్ చేసిన ఫోటోలకు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.