మెగా కోడ‌లు కాబోతున్న లావ‌ణ్య త్రిపాఠి వ‌రుణ్ తేజ్ కోసం ఎంత క‌ట్నం తెస్తుందో తెలిస్తే షాకే!

అందాల రాక్షసి సినిమాతో కుర్ర‌కారు గుండెల్లో అల‌జ‌డి రేపిన డెహ్రాడూన్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి త్వ‌ర‌లోనే మెగా కోడ‌లు కాబోతున్న సంగ‌తి తెల‌సిందే. నాగ‌బాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో కొంత కాలం నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న లావ‌ణ్య త్రిపాఠి.. ఇప్పుడు అత‌డితో ఏడ‌డుగులు వేసేందుకు సిద్ధం అయింది.

జూన్ 9న వీరిద్ద‌రికీ నిశ్చితార్థం కూడా జ‌ర‌గ‌బోతోంద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ‌స‌భ్యులు, ద‌గ్గ‌రి బంధువులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి ఎంగేజ్మెంట్ జ‌ర‌గ‌బోతోంది. ఈ ఏడాది చివ‌ర్లో వ‌రుణ్‌-లావ‌ణ్య వివాహాన్ని నాగ‌బాబు ఘ‌నంగా చేయ‌బోతున్నార‌ట‌. అయితే ఇప్పుడు లావ‌ణ్య త్రిపాఠి వ‌రుణ్ తేజ్ కోసం తెస్తున్న క‌ట్న‌కానుక‌లు హాట్ టాపిక్ గా మారాయి.

లావ‌ణ్య త్రిపాఠి త‌ల్లిదండ్రులు వ‌రుణ్ తేజ్ కు గ‌ట్టిగా క‌ట్నం ఇస్తున్నారట‌. వివాహం అనంత‌రం వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి క‌లిసి ఉండేందుకు ఓ ల‌గ్జ‌రీ హౌస్‌, ఖ‌రీదైన ఖారు ఇస్తున్నార‌ట‌. అలాగే ఐదు కిలోల బంగారంతో పాటు ఆరు కోట్లు రూపాయిలు క‌ట్నంగా ఇస్తున్నార‌ట‌. ఇవ‌న్నీ తీసుకోవ‌డం వ‌రుణ్ తేజ్ కు ఇష్టం లేక‌పోయినా.. లావణ్య త్రిపాఠి తల్లితండ్రులు మా తృప్తి కోసమైనా తీసుకోమ‌ని చెప్పార‌ట‌. దాంతో వ‌రుణ్ తేజ్ కూడా వాళ్ల‌ను బాధ‌పెట్ట‌డం ఇష్టంలేక ఓకే చెప్పాడ‌ట‌.