ఆ త‌ప్పుడు వార్త‌ల‌పై లావ‌ణ్య త్రిపాఠి సీరియ‌స్.. మెగా కోడ‌లికి మండింది రోయ్‌!

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరికొద్ది నెలల్లో అతనితో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా వైభవంగా జరిగింది. ప్రస్తుతం అటు వరుణ్ తో పాటు ఇటు లావణ్య త్రిపాఠి కూడా తమ సినిమాలతో బిజీ అయిపోయారు.

ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుంచి లావణ్య త్రిపాఠి గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. లావణ్య త్రిపాఠికి ట్రిపోఫోబియా అనే ఓ అరుదైన వ్యాధి ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోబియా వల్ల‌ కొన్ని ఆకారాలను, వస్తువుల‌ను, కొత్తవాటిని చూస్తే తెలియకుండానే భయం కలుగుతుంద‌ట‌. ఈ వ్యాధితో లావణ్య త్రిపాఠి చాలా రోజుల నుంచి బాధపడుతుందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్త‌లు చూసిన‌ మెగా కోడలుకు బాగా మండింది. తాజాగా లావణ్య త్రిపాఠి తనకు అరుదైన వ్యాధి ఉందంటూ వస్తున్న వార్తలపై అందిస్తూ కాస్త సీరియస్ అయింది. `నాకు అరుదైన వ్యాది ఉందా? నాకు తెలిసి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్త‌లు రాయ‌డం వ‌ల్ల‌ మీకొచ్చే లాభం ఏంటి..? ఇక‌నైన నిజం తెలుసుకుని రాయండి` అంటూ లావణ్య త్రిపాఠి స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో రెండు రోజుల నుంచి నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారం అవాస్త‌వం అని తేలిపోయింది.