బాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఏకంగా ఆ హీరో సరసన ఛాన్స్!

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు హీరోలకు జంటగా నటించిన సినిమాలు కూడా ఆ రేంజ్‌లో హిట్ అవ్వలేదు. కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ, సర్కార్‌ వారి పాట, రంగ్ దే, నేను లోకల్ లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 

ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. తెలుగులో కాకుండా హిందీ, తమిళ సినిమాలలో కూడా కిర్తి సురేష్ నటిస్తుందని సమాచారం. ఇదే సమయంలో ఈమె కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నటిస్తోంది. అంతేకాకుండా తాజాగా ఈ అమ్మడు కోటక్ మహేంద్ర బ్యాంకు కమర్షియల్ యాడ్ లో కనిపించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.

సాధారణంగా ఆ యాడ్ లో కనిపిస్తే పెద్దగా చర్చ జరిగేది కాదు. ఈ అమ్మడు ఆ యాడ్ కోసం చాలా కష్టపడుతున్నట్లు అర్ధం అవుతుంది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి కష్టమైన స్టంట్స్ చేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే చాలా మంది ఆ బ్యాంక్‌ యాడ్ కోసం అంత కష్టమైన స్టంట్స్ చెయ్యాల్సిన అవసరం లేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందేమో ఈ స్టంట్స్ తో కీర్తి తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతుందని అంటున్నారు. ఏదయితేనేం కీర్తి సురేష్ బాలీవుడ్ హీరోతో కలిసి చేసిన స్టంట్స్ వైరల్ గా మారాయి.