జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ రీసెంట్ గా `దసరా` మూవీతో ప్రేక్షకులను పలకరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కీర్తి సురేస్ `భోళా శంకర్` సినమాలో నటిస్తోంది. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా అలరించబోతోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కీర్తి సురేష్ కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కీర్తి సురేష్ తో అర్థరాత్రి ఎలాంటి పనులు చేస్తుందో తెలిస్తే షాకైపోతారు.
అయితే భోళా శంకర్ లో తన పార్ట్ షూటింగ్ ను తాజాగా కంప్లీట్ చేసుకున్న కీర్తి సురేష్.. హైదరాబాద్ నగరంలో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అర్థరాత్రి ఫ్రెండ్స్ తో కలిసి గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో హల్చల్ చేసింది. అందరితో కలిసి అక్కడ టిఫిన్ చేసింది. అనంతరం తనకెంతో ఇష్టమైన తందూరి టీ కూడా తాగేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కీర్తి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మరి కీర్తిని జనాలు చూసి ఎగబడకుండా ఉన్నారా? అంటే ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే మహాముదురు అయిన కీర్తి.. తన ముఖానికి మాస్క్ పెట్టేసుకుంది. దాని వల్ల ఆమె పబ్లిక్ గా తిరిగినా ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఇంకేముందు కీర్తి సురేష్ ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసేసింది.