చరణ్ దంపతులకు ఆహ్వానం.. తారక్ పోస్ట్ వైరల్..!

ఎట్టకేలకు మెగా ఇంటికి వారసురాలు వచ్చేసింది. ఉపాసన కామినేని కొనిదెల ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయి రాకతో తమ ఆనందం రెట్టింపు అయిందని అటు మెగా ఫ్యామిలీ కూడా తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక మెగా ఫ్యామిలీ సభ్యులే కాదు అభిమానులు, సినీ సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ కు అత్యంత ప్రాణ స్నేహితుడైన గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒక పోస్ట్ షేర్ చేసి దంపతులు కాస్త తల్లిదండ్రులుగా మారిన వేళ వారిని పేరెంట్స్ క్లబ్ కి ఆహ్వానిస్తూ బిడ్డ పుట్టిన ఆనందాన్ని పంచుకుంటూ ఉపాసన, రాంచరణ్ లకు అభినందనలు తెలియజేశారు. రామ్ చరణ్, ఉపాసనలను ఉద్దేశిస్తూ తారక్ ఇలా పోస్ట్ చేయడం జరిగింది. ఉపాసన రాంచరణ్ మీరిద్దరూ ఒక బిడ్డకు జన్మనిచ్చినందుకు మిమ్మల్ని పేరెంట్స్ క్లబ్ లోకి ఆహ్వానిస్తున్నాము.Jr NTR: Arranged marriage at 18, mother of two.. Who is Jr NTR's wife  Lakshmi? – rrr

మీరు పాపతో గడిపే ప్రతి క్షణం కూడా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఇక మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటనలు ఏవైనా ఉన్నాయి అంటే మీరు మీ పాపతో గడిపే క్షణాలు మాత్రమే.. పాపకి దేవుడి ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి. పాప పుట్టిన సమయాన్ని మీరు మరింత రెట్టింపు ఆనందంతో గడపాలని కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే లక్ష్మీపార్వతి తారక్లకు ఆడపిల్ల పైన్ ఇష్టం ఉన్నా సరే వీరికి ఆడపిల్ల జన్మించలేదు. ఇక తన ప్రాణ స్నేహితుడికి ఆడపిల్ల జన్మించేసరికి మరింత ఉబ్బితబ్బిబవుతున్నారు ఎన్టీఆర్.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)