పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్!

కీర్తి సురేష్ గురించి నెట్టింట ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె ఫోటోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా మరో రూమర్ ఇప్పుడు ట్రేండింగ్ అవుతుంది. ఈసారి కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు వార్తలు చక్కరులు కొడుతున్నాయి. ఈ రూమర్లకు కీర్తి చేసిన కామెంట్లు కూడా కారణమయ్యాయి.

కీర్తి సురేష్..ఈమె పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది మహానటి సినిమా. మహానటి సినిమా కీర్తిని స్టార్ హీరోయిన్ చేసింది. తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన దసరా సినిమాలో కీర్తి వెన్నెల పాత్రలో జీవించింది. మహానటి సినిమా తరువాత ఆ స్థాయి విజయం దసరా సినిమాతో దక్కింది. ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే మహేష్ కి జంటగా సర్కారు వారి పాట సినిమాలో అదరగొట్టింది. హీరోయిన్ గానే కాకుండా సినిమాలో ముఖ్యమైన పాత్ర ఉంటె కీర్తి ఆ సినిమాలో కనిపిస్తుంది.

ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా కీర్తి పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు అనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 29న కీర్తి నటించిన మామన్నన్ విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీపై స్పీన్దించింది. మీరు రాజకీయాల్లోకి వస్తారా? అని కొందరి అడుగుతున్నారు. దీనిపై ఆలోచించాలి అని ఆమె అన్నారు. దీంతో కీర్తి చేసిన కామెంట్ భవిష్యత్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని, ఆమెకు కూడా పాలిటిక్స్ లో రావడం ఇష్టమేనని అర్థం అవుతుంది. కీర్తి తరువాత సినిమా భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది.