ప్రభాస్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజు..!!

తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అంటే తెలియని వాలంటూ ఎవరూ ఉండరు..తమిళంలో అయితే ఖైదీ ,విక్రమ్, మాస్టర్ సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.ముఖ్యంగా విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. అంతేకాదు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ .500 కోట్ల రూపాయల కలెక్షన్ సంపాదించింది..ఇక ఖైదీ సినిమా మంచి సక్సెస్ ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. మాస్టర్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా చాలా వరకు సేఫ్ అయ్యింది

After Kamal Hassan's 'Vikram', Lokesh Kanagaraj to direct Prabhas | Tamil  Movie News - Times of India
ఇది కాస్త పక్కన పెడితే ప్రస్తుతం ఇతను లియో అనే చిత్రాన్ని విజయ్ తో కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా లియో సినిమా పూర్తయిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో నేను సినిమా చేయబోతున్నాను అంటూ లోకేష్ కనకరాజ్ చెప్పుకొస్తున్నారు .మేమిద్దరం కలిసి సినిమా చేస్తే మా ఇద్దరికీ కెరియర్లో పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. లియో సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెడతాను అంటూ లోకేష్ చెప్పుకొచ్చాడు.

ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే మా ఇద్దరికీ మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ కి తమిళంలో ఉన్న మార్కెట్ అంత స్ట్రాంగ్ గా లేదు అలాగే తమిళ దర్శకులు ఎంత పెద్ద సక్సెస్ కొట్టిన హిందీలో మాత్రం తమిళ సినిమా రేంజ్ ను పెంచలేకపోతున్నారు. కాబట్టి ప్రభాస్ ,లోకేష్ కలిస్తే ఆ లోటు తీరిపోతుంది అనే చెప్ప వచ్చు .మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తుందో చూడాలి మరి.. ఏది ఏమైనా ప్రభాస్ తో సినిమాపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు.