డ్రగ్స్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న హీరో నిఖిల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు నిఖిల్.. ఆ తర్వాత తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా తన నటించిన స్పై సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వైరల్ గా మారుతోంది.

Nikhil Siddharth Kanithan remake went on floors
కభాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు వ్యవహారం వల్ల అతని మొబైల్లో ఉన్న ఫోటోలు , వీడియోలు, మొబైల్ నెంబర్ల వల్ల సినీ ఇండస్ట్రీలో ఉండే యాక్టర్స్ సైతం ఈ వ్యవహారం పైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లు కూడా వినిపించడం జరిగింది. తాజాగా డ్రగ్స్ వ్యవహారంపై హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిరోధక విభాగంలో పోలీసులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిఖిల్ మరొక నటుడు ప్రియదర్శిని పాల్గొనడం జరిగింది.

Priyadarsi | Greatandhra

ఇందులో మాట్లాడుతూ నిఖిల్ తనను కూడా డ్రగ్స్ తీసుకోమని ఆఫర్ చేశారని కానీ తాను ఇలాంటి అసలు సహించారని తెలియజేశారు.. విద్యార్థులు ఎవరైనా సరే వీటికి అలవాటు పడితే ఇక అది మరణమే అలాంటి వాటిని నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించను దూరంగానే ఉంటానని తెలిపారు. పార్టీలకు వెళ్లండి కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోవద్దండి అంటూ తెలియజేశారు. త్వరలోనే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని తెలియజేయడం జరిగింది నిఖిల్ .అలాగే హీరో ప్రియదర్శి మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం తను సిగరెట్ తాగే వాడినని కానీ దానికి బానిస అవుతున్నానని తెలుసుకొని కొంతకాలం తర్వాత తన ప్రవర్తన చూసి తనకి అసహ్యం వేసి సిగరెట్ మానేశానని తెలిపారు. ఎలాంటి చెడు అలవాట్లకు విద్యార్థులు బానిసలు కావద్దండి అంటూ తెలియజేయడం జరిగింది.