మ‌హేష్ బాబు, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలా లేక‌ ఫ్యామిలీనా అంటే మహేష్ కచ్చితంగా ఫ్యామిలీకే ఓటు వేస్తాడు. ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో మహేష్ బాబుకి మొదటి స్థానం ఇవ్వొచ్చు. కోట్లు తెచ్చే సినిమా కంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడమే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని మహేష్ నమ్ముతాడు.

అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాస‌రే..గ్యాప్ తీసుకుని మ‌రీ త‌ర‌చూ ఫ్యామిలీతో వెకేష‌న్స్ కు వెళ్తుంటాడు. ఇక సేమ్ టు సేమ్ సాయి పల్లవి కూడా అంతే. మ‌న న్యాచురల్ బ్యూటీ కూడా మహేష్ మాదిరిగానే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ను ఇస్తుంది. ఫ్యామిలీతోనే ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డుతుంది. షూటింగ్ లో ఒక్క‌సారి ప్యాకప్ చెప్పాక తాను న‌టిని అన్న విష‌యాన్నే మ‌ర్చిపోతుంద‌ట‌.

`ప‌నిలో ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు ఆ పని చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అలాగని దాన్నే వ్యక్తిగత జీవితంలోకి తీసుకురాకూడదు. దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. వృత్తిని..వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూసినప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త లేక‌పోతే ఎన్ని కోట్లు ఉన్నా వేస్టే` అంటూ సాయి ప‌ల్ల‌వి చెబుతోంది. కాగా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. కార్తికేయ‌న్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి క‌మ‌ల్ హాస‌న్ నిర్మిస్తున్నారు.