కీర్తి సురేష్ గొంతు నొక్కిన చిరంజీవి.. అంత కోపం ఎందుకు వచ్చిందంటే..

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలోనే తన నటన విశ్వరుపాన్ని చూపించింది. చాలావరకు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించి అందరిని ఫిదా చేసింది. మహానటి సినిమా తరువాత జూనియర్ సావిత్రిగా ట్యాగ్ సొంతం చేసుకుంది.

అలానే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లైఫ్‌లో జరిగే అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఏ సినిమా షూటింగ్ సెట్‌లో అయినా కీర్తి చాలా సరదాగా ఉంటుంది. ఇటీవలే విడుదలైన ‘దసరా’ సినిమా షూటింగులో కీర్తి చేసే అల్లరి అల్లరి చేసే వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ సెట్స్ లో తన తోటి నటినటులతో చాలా సరదాగా ఉంటారు. అయితే ఆయన ఎప్పుడు ఎవరిపై కోప్పడింది లేదు. కానీ తాజాగా కీర్తి సురేష్ పై కోపం చూపించడమే కాకుండా ఆమె గొంతు పట్టుకున్నట్లు కనిపించారు. అసలు విషయం ఏంటంటే ‘భోళా శంకర్ సినిమా షూటింగ్ సెట్ లో చిరు, తమన, కీర్తి అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారట. ఆ సమయంలో కీర్తి సురేష్ చిరంజీవిని సరదాగా ఏదో మాట అనడంతో ఆయన కీర్తి సురేష్ వైపు కోపంగా లుక్కేసి ఆమె గొంతుపట్టుకున్నారు’. అయితే ఇదంతా సరదాగా జరిగింది. దీనికి సంబందించిన వీడియోని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియో చూసినా వాళ్లంతా చిరు, కీర్తి నిజంగానే సొంత అన్నా, చెల్లెలుగా సరదాగా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.