లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట ఎట్టకేలకు 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే నేడు నయనతార-విఘ్నేష్ మొదటి పెళ్లి రోజు.
ఈ సందర్భంగా అభిమానులకు నయనతార అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తన కవల కుమారులను తొలిసారి అందరికీ చూపించింది. పెళ్లయిన నాలుగు నెలలకే నయనతార సరోగసి పద్ధతిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇంతవరకు తన కుమారుల ఫోటోలు బయటకు రానివ్వలేదు. నేడు తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్శిరీ సందర్భంగా నయనతార దంపతలు పిల్లల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
నయన్ తన ఇద్దరు కుమారులైన ఉయిర్, ఉలగమ్ ని గుండెకు హత్తుకుని ఉన్న ఫోటోలను విఘ్నేష్ శివన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. నెటిజన్లను కూడా ఈ పిక్స్ ఎంతగానో ఆకర్షిస్తున్నారు.
కాగా, నయనతార ప్రస్తుతం బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కు జోడీగా `జవాన్` అనే సినిమాలో నటిస్తోంది. ఇదే నయన్ తొలి బాలీవుడ్ మూవీ.
మరోవైపు విఘ్నేష్ కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ నుంచి విఘ్నేష్ శివన్ తప్పుకున్నాడు.