పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ `బ్రో`. దర్శకనటుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ `వినోదయ సీతం` కు రీమేక్ ఇది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. బ్రో బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిందని అంటున్నారు. అంతేకాదు, విడుదకు ముందే ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చాయని టాక్ నడుస్తోంది. ఈ మూవీకి అందరి రెమ్యునరేషన్ లతో కలుపుకొని రూ. 120 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట.
అయితే బ్రో థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కలిసి ఏకంగా రూ. 175 కోట్లకు అమ్ముడు పోయాయని ప్రచారం జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ తో ఆటు పవన్ కళ్యాణ్ ఉండటం వల్లే బ్రో సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని అంటున్నారు. కాగా, బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రను పోషిస్తే.. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ లో చనిపోయి మళ్లీ బతికే వరం పొందిన వ్యక్తిగా కనిపిస్తాడు. నిజానికి ఇందులో పవన్ పాత్ర నిడివి కేవలం ఇరవై నిమిషాలే. అయినాసరే పవన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బ్రో పై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి.