టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియమణి.. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తోంది. రీసెంట్ గా విడుదలైన `కస్టడీ` మూవీలోనూ ముఖ్యమంత్రి పాత్రలో ఆకట్టుకుంది. అలాగే వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా కమిట్ అవుతూ కెరీర్ ను కొనసాగిస్తోంది.
ప్రియమణి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన టైమ్ లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది. అయితే ముస్తఫా రాజ్ కు ఇది రెండో వివాహం. ప్రియమణి కంటే ముందు ముస్తఫా రాజ్ ఒక యువతిని వివాహం చేసుకోగా.. మనస్పర్థలు విడిపోయారు. ఆ తర్వాత ప్రియమణి, ముస్తఫా రాజ్ ప్రేమించుకుని.. చాలా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగి చాలా ఏళ్లు అవుతున్నా.. వీరిద్దరికీ సంతానం లేరు. పైగా చాలా కాలం నుంచి ముస్తఫా రాజ్, ప్రియమణి దూరంగా ఉంటున్నారు.
వ్యాపార నిమిత్తం ముస్తఫా రాజ్ విదేశాల్లో ఉంటే.. ప్రియమణి తన కెరీర్ కోసం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇకపోతే ఆదివారం రోజు ప్రయహని తన 39వ పుట్టినరోజును ఫ్యామిలీతో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది. కేక్స్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నా.. స్పెషల్ డే నాడు ప్రియమణి పక్కన ముస్తఫా రాజ్ మాత్రం లేడు. భర్తను బాగా మిస్ అయిన ప్రియమణి.. బర్త్ డే పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ `మిస్ యు ముస్తఫా రాజ్` అని ఎమోషనల్ కామెంట్ పెట్టింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూరు. ప్రియమణికి భర్త ఉన్నా లేనట్లే అని.. ముఖ్యమైన రోజుల్లో కూడా భార్యభర్తలిద్దరూ కలిసుకోలేకపోతే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CtEvtKppmtZ/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==