ఇండియన్ సినీ ప్రియులందరూ ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న `ఆదిపురుష్` రేపు అట్టహాసంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మైథలాజికల్ విజువల్ వండర్ 6200లకుపైగా స్క్రీన్స్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుక్కింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో `ఆదిపురుష్` స్టార్స్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాముడిగా నటించిన ప్రభాస్ ఈ సినిమా కోసం రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటే, సీత పాత్రలో మెరిసిన కృతి సనన్ రూ. 4 కోట్లు ఛార్జ్ చేసింది. అలాగే రావణాసురుడు పాత్రను పోషించిన సైఫ్ అలీ ఖాన్ రూ. 12 కోట్లు, లక్ష్మణుడు పాత్ర చేసిన సన్నీ సింగ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నారట. ఇక హనుమంతుడు పాత్రలో నటించిన దేవదత్త నాగే కూడా రూ. 1.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడని తెలుస్తోంది.