రికార్డు ధ‌ర ప‌లికిన‌ `ఆదిపురుష్‌` డిజిట‌ల్ రైట్స్‌.. ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలిస్తే మైండ్ బ్లాకే!

రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మైథ‌లాజిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ భారీ అంచ‌నాల న‌డుమ జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రంపై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించ‌ని రేంజ్ లో జ‌రిగింది. బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. మ‌రోవైపు ఆదిపురుష్ డిజిట‌ల్ రైట్స్ కూడా రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఆదిపురుష్ డిజిట‌ల్ రౌట్స్ ను ద‌క్కించుకుంద‌ట‌.

అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు రూ. 250 కోట్ల‌కు కొనుగోలు చేశార‌ట‌. ప్ర‌భాస్ కెరీర్ లోనే హ‌య్యెస్ట్ ఓటీటీ డీల్ ఇది. ఇక ఆదిపురుష్ ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతున్నారు. ఈ మ‌ధ్య ఎంత పెద్ద సినిమా అయినా థియేట‌ర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల‌కే ఓటీటీలోకి వ‌చ్చేసింది. కానీ, ఆదిపురుష్ మాత్రం థియేట‌ర్స్ లోకి దిగిన ఎనిమిది వారాల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేలా ఒప్పందం చేసుకున్నార‌ట‌. ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌స్ట్ సెకండ్ వీక్‌లో ఆదిపురుష్ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.