సెన్సార్ పూర్తి చేసుకున్న `ఆదిపురుష్‌`.. ర‌న్ టైమ్ అన్ని గంట‌లా?

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్ తెర‌కెక్కించిన మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌`. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి స‌న‌న్‌, రావణాసురుడిగా సైఫ్‌ అలీ ఖాన్ నటించారు. అలాగే స‌న్నీ సింగ్, దేవదత్త నాగే త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక‌పోతే తాజాగా మూవీ సెన్సార్ పనుల‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. కొద్దిసేపటికి ఈ విషయాన్ని చిత్ర‌ యూనిట్ అనౌన్స్ చేసింది. సెన్సార్ స‌భ్యులు ఆదిపురుస్‌ సినిమాకు యు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ మూవీ రన్ టైం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సినిమా మొత్తం రెండు గంటల 59 నిమిషాలు నిడివిని కలిగి ఉంది. అంటే దాదాపు మూడు గంటల ర‌న్ టైమ్ లో అదిపురుష్ రాబోతోంది. ఈ మ‌ధ్య‌కాలంలో ఇంత భారీ ర‌న్ టైమ్ తో ఏ సినిమా రాలేదు. మ‌రి మూడు గంట‌ల పాటు డైరెక్ట‌ర్ ఓం రౌత్ ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ లో కూర్చోపెట్ట‌గ‌ల‌డా.. లేదా.. అన్న‌ది తెలియాలంటే జూన్ 16న వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఈ సినిమాను ఏకంగా రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. తెలగు రాష్ట్రాల్లోనే ఆదిపురుష్ కు రూ. 185 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా కూడా ఇదే స్థాయిలో ఆదిపురుష్ థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడుపోతున్నాయి.