`ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖ‌ర్చుతో 2 సినిమాలు తీయ‌వ‌చ్చు.. తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. జూన్ 16న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ పెంచుతున్నారు. మ‌రోవైపు క‌ళ్లు చెదిరే స్థాయిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. కేవ‌లం తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కులే రూ. 185 కోట్ల‌కు అమ్ముడుపోయాయి అంటూ ఆదిపురుష్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక‌పోతే జూన్ 6వ తేదీన తిరుప‌రిలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో రెండొందల మంది డ్యాన్సర్లు, రెండొందల మంది సింగర్లు ప్ర‌ద‌ర్శ‌న చేయ‌బోతున్నార‌ట‌. వీరంద‌రినీ ముంబై నుంచి దింపుతున్నార‌ట‌. భారీ అభిమానుల న‌డుమ ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాగ‌బోతుంద‌ట‌. ఇక ఈ ఈవెంట్ కోసం మేక‌ర్స్ ఏకంగా రూ. 4 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసి నెటిజన్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖ‌ర్చుతో రెండు చిన్న సినిమాల‌ను ఈజీగా తీయ‌వ‌చ్చు అంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.