శర్వానంద్ కారుకు యాక్సిడెంట్.. ఫిలింనగర్లో దుర్ఘటన..!

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కారు తాజాగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శర్వానంద్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో శర్వానంద్ లేరు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ కుటుంబ సభ్యులు ఈ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఏమైనా అయిందా లేదా అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు.

శర్వానంద్‌కు రేంజ్ రోవర్ కారు ఉంది. ఇది ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర కంట్రోల్ తప్పింది. ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో శర్వానంద్ కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. అయితే మొదట ఇలా వార్తలు వచ్చాయి. తర్వాత శర్వానంద్ కారులోనే ఉన్నాడని రూమర్స్ నడిచాయి. ఈ హీరోకి స్వల్పంగా గాయాలయ్యాయని సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రమాదం జరిగిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని.. హాస్పటల్ కు తరలించారని స్థానికుల ప్రకారం తెలుస్తోంది. ఇకపోతే రీసెంట్ గా శర్వానంద్ కు ఎంగేజ్‌మెంట్ అయిన సంగతి తెలిసిందే.

శర్వానంద్ మొదట చిరంజీవితో కలిసి థమ్స్ అప్ ప్రకటనలో మీడియా దృష్టికి వచ్చాడు. ఆ తర్వాత 2003లో ఐదో తారీకు సినిమాతో తెలుగులో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. శంకర్ దాదా M.B.B.S లో చిరంజీవితో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడానికి ముందుకు వచ్చాడు. వెంకటేష్ తీసిన సంక్రాంతి, లక్ష్మి సినిమాలలో సహాయక పాత్రల్లో నటించారు.