ఆదిపురుష్.. మరి కొద్ది రోజుల్లోనే రామాయణం ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖన్నా, సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు కీలక పాత్రలను పోషించారు. మొన్నటి వరకు ఆదిపురుష్ వివాదాలకు కేంద్ర బింధువుగా ఉంది.
కానీ, ట్రైలర్ విడుదల తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ప్రమోషన్స్ తో మరింత హైప్ పెంచుతున్నారు. అయితే తాజాగా ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ రెడీ అయింది. రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదిపురుష్ ను ప్రదర్శించారట.
అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అనుకున్న దానికంటే ఆదిపురుష్ అద్భుతంగా ఉందని, సినిమా ఒక విజువల్ వండర్ లా ఉందని చెప్పారట. మొదట్లో వచ్చిన విమర్శలకు దీటైన జవాబులా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్నాయని.. సీతారాములిగా ప్రభాస్, కృతి సనన్ పర్ఫెక్ట్ సెట్ అయ్యారని అభిప్రాయపడ్డారట. రామాయణం ని గ్రాండ్ స్కేల్ లో సరికొత్త టెక్నాలజీ తో చూపించారని.. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అన్నారట. ఇదే నిజమైతే ప్రభాస్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడటం ఖాయమవుతుంది.