టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. తాజాగా ఓటీటి ఆహా సంస్థలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో కి హాజరు కావడం జరిగింది. ఈ షో సీజన్ -2 ఫైనల్ కీ చేరుకోగా విజేతలకు అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఇక్కడికి అతిథిగా రావడం జరిగింది.
ఇక ఈ షోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తనకు దేవుడు ఎలా ఉంటారో తెలియదు కానీ నాకు తెలిసిన దేవుడు మాత్రం తన తండ్రి అని ఆయనే నాకు అన్నీ ఇచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ షోలో అల్లు అర్జున్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి కనిపించబోతున్నారు. ఈ షో జూన్ -3,4వ తేదీన ప్రసారం కాబోతున్నది.
ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప -2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. పుష్ప మొదటి భాగం విడుదలై భారీ ఎత్తుగా నిలిచింది భారీ బడ్జెట్ తో తేరకెక్కించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఈ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సైతం క్రియేట్ చేస్తుంటే తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
The ICONIC PROMO of ICONIC FINAALE❤️Less than two hours to go! Turn your notifications on 😍 #TeluguIndianIdol2https://t.co/tRCrOeFxUs#AAforTeluguIndianIdol2 #IconicFinAAle @alluarjun #AlluArjun @MusicThaman
— ahavideoin (@ahavideoIN) May 28, 2023