ఎలాంటి సందర్భాలలో అయినా సరే ఏ విధంగా అయినా మారేటువంటి ఆటగాళ్లలో మహేంద్రసింగ్ ధోని మించిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత టీమిండియా కు వరల్డ్ కప్ అందించిన కేవలం చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు.. 2004లో మొదటిసారి తన అంతర్జాతీయ కెరీర్ని ప్రారంభించిన ధోని 20 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా తనలోని ఎమోషనల్ బయట పెట్టలేదు. తనలో ఉండే కోపాన్ని పలు సందర్భాలలో మాత్రమే చూపిస్తారు. కానీ కళ్ళలో నీళ్లు తిరిగిన సందర్భం ఏ ఒక్కసారి కూడా చూడలేదు..
తాజాగా నిన్నటి రోజున ఐపీఎల్ ఫైనల్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ గురించి ధోని మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది.. ఐపీఎల్ ఫైనల్ చెన్నై సూపర్ కింగ్ గెలిచి అన్నట్టుగానే రికార్డు స్థాయిలో ఐదవ సారి టైటిల్ ని అందుకుంది. ఎక్కడ చూసినా వాతావరణం సంబరాలు మొదలయ్యాయి.. కానీ ఎప్పుడు లేని విధంగా ధోని తనలోని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు.. దీంతో జడేజాన్ని పైకి ఎత్తుకొని మరి తన సంతోషాన్ని తెలిపారు ధోని. ఇలా చూడడం సగటు ప్రేక్షకుడిగా ఒక ప్రత్యేక అనుభూతినిచ్చింది అని చెప్పవచ్చు.
ఈ విషయంపై కామెంట్రీ హర్ష భోగ్లే అడగడం జరిగింది.. ధోని మాట్లాడుతూ తన కెరియర్లో ఇది చివరి అంకం..మొదటి మ్యాచ్ నుంచి అభిమానులు తన పేరును జపిస్తూ తనపై ప్రేమను చూపించారు. ఆ సమయంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి డక్ ఔట్లో కూర్చున్నప్పుడు కూడా ఎన్నో అందమైన ప్రత్యక్షమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించాను..
చెన్నైలో నా లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా నాకు ఇదే భావన నా కెరియర్ చివరి దశ..మరో ఐపిఎల్ ఆడేందుకు కూడా ప్రయత్నిస్తా నాపై అభిమానులు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది.. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.. తన నిర్ణయాన్ని మరో ఆరు నెలల లోపు ప్రకటిస్తానని తెలిపారు.
Thala happy and so are we ✨💥pic.twitter.com/WfT3VybSUt
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023