డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా పెను సంచలనంగా మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గతంలో అంతా నా ఇష్టం అంటూ ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.తాను ఎలా ఉంటాడో నిజాన్ని నిక్కచ్చిగా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా నిజం అనే ఒక పేరుతో ఒక ఛానల్ ని కూడా ప్రారంభిస్తున్నాడు. నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాలు బట్టబయలు అయ్యేలా చేయడమే అన్నట్లుగా సమాచారం. తనదైన స్టైల్గా రాంగోపాల్ వర్మ దీనిని ప్రచూరించాడు.
నిజం చచ్చిపోయినట్టు నటిస్తుంది..తప్ప దాన్ని ఎవరు చంపలేరు.. ఇకపై అన్ని నిజాలే మాట్లాడతాను కేవలం రాజకీయాలే కాకుండా బర్నింగ్ టాపిక్స్ సైన్స్ చరిత్ర కృత్రిమ మేధస్సు సెక్స్ ఫిలాసఫీ క్రైమ్ పోలీస్ న్యాయస్థానాలు ఇలా అన్ని టాపిక్స్ పైన నిజం గుడ్డలూడదీస్తానంటూ ప్రకటించారు. నిపుణులు ఆలోచన పరులు పరిశోధకులు ఇలా అన్ని సెక్షన్లు ప్రముఖులు వచ్చి ఆర్జీవితో ఈ ఛానల్ లో మాట్లాడుతారని తెలుస్తోంది. ఇందుకోసం కొంతమంది మేధావులను కూడా కలుపుకొని వర్మ ఛానల్ ని రన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారుతోంది.
గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న బిగ్ డెబిట్గా మారిన వైఎస్ వివేక హత్య వెనుక నిజములో అపార్థం ఉందా అని ఎపిసోడ్ ను నిజం చానల్లో ఏప్రిల్ 25న 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంపై వ్యాయంగా స్పందించి ఆర్జీవి నిజంగానే నిజాలు బయట పెట్టేస్తారా డబ్బుకు అమ్ముడుపోయే వ్యవస్థ తాలూకా నగ్నసత్రాలను కూడా నిజం ఛానల్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆర్జీవి నిజం ఛానల్ తెలుగు రాష్ట్రాలలో నిజంగానే సంచలనం అవుతుందేమో చూడాలి మరి.
https://twitter.com/RGVzoomin/status/1650461404376494080?s=20