విరూపాక్ష-2 పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరంతేజ్..!!

హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఫర్ఫెక్ట్ త్రిల్లర్ సినిమాగా సంబంధించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసులు చేసి రూ .50 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. విడుదలైన ఈ చిత్రం ఒక వారంలోనే అన్ని ఏరియాలలో కూడా బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.

Virupaksha 2 Days Total Collections! : T2BLive
ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ సుకుమార్ కథను అందించడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ తీయడానికి నిర్మాత బివిఎస్ ప్రసాద్ ఆసక్తిగా ఉన్నామంటూ ప్రకటించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి సాయి ధరంతేజ్ అధికారికంగా వెల్లడించారు. చాటింగ్ సెషన్ లో భాగంగా ఎంతో సంతోషంగా ముచ్చటించిన పార్ట్-2 ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు.

ట్విట్టర్ లో చాటింగ్ లో రాజీవ్ కనకాల పాత్రను ఎందుకు చంపలేదని ప్రశ్న ఎదురవుగా అందుకు కొనసాగింపు ఇంకా ఉందని తేజు సమాధానం ఇచ్చారు. మూవీ చివరిలో కంటిచూపు వేరియేషన్స్ కూడా కథ కంటిన్యూటిని చూపిస్తోందని అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తేజ్ తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే విరూపాక్ష సీక్వెల్ ఉంటుందేమో చూడాలి మరి.